Revanth reddy : బీఆర్ఎస్-బీజేపీది ఫెవికాల్ బంధం

బీఆర్ఎస్, బీజేపీ రహస్య స్నేహాన్ని మోదీ నిజామాబాద్లో బయటపెట్టారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. బీఆర్ఎస్ అవినీతిలో బీజేపీని కూడా కేసీఆర్ భాగస్వామిని చేశారని ఆరోపించారు. కేసీఆర్ అక్రమ సంపాదనలో కొంత మోదీకి చెల్లిస్తున్నారని విమర్శించారు. మోదీ మాటల తర్వాత ఎంఐఎం, బీఆర్ఎస్తో దోస్తీ చేస్తుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్తో దోస్తీపై ఎంఐఎం ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారన్న మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్రెడ్డి.. ఇన్నాళ్లు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని మార్చాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారని.. రేవంత్ ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్కు కేసీఆర్కు డబ్బు పంపారని మోదీ అంటున్నారని ఆ సమాచారం ఉంటే కేసీఆర్పై ఎందుకు చర్య తీసుకోలేదు? ఈడీ, ఐటీ కేసులు ఎందుకు నమోదు కాలేదని రేవంత్ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ అవిభక్త కవలలని, వారిది ఫెవికాల్ బంధమని అన్నారు. సెక్యులర్ వాదులమని చెప్పే అసదుద్దీన్ ఇప్పుడేం చెబుతారని నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
