TDP DEEKSHA: నారా భువనేశ్వరి "సత్యమేవ జయతే" దీక్ష

TDP DEEKSHA: నారా భువనేశ్వరి సత్యమేవ జయతే దీక్ష
X
టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయడు దీక్ష.. భారీగా పాల్గొంటున్న కార్యకర్తలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. రాజమండ్రి క్వారీ సెంటర్‌ వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరశన దీక్షలో కూర్చొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి భువనేశ్వరి అంజలి ఘటించిన అనంతరం దీక్ష చేపట్టారు.


మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్యనేతలు దీక్షలో కూర్చొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు టీడీపీ నేతల దీక్ష కొనసాగనుంది.

Tags

Next Story