SAD: చైనా మాంజా మెడకు చుట్టుకుని సైనికుడి మృతి

X
By - Sathwik |15 Jan 2024 8:00 AM IST
హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.కోటేశ్వర్ రెడ్డి అనే ఓ ఆర్మీ జవాను శనివారం రాత్రి విధులకు వెళ్లే సమయంలో లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై చైనీస్ మాంజా మెడకు చుట్టుకుని కింద పడిపోయాడు. పక్కనే ఉన్న ఆర్మీ ఆస్పత్రి సిబ్బంది గమనించి హుటాహుటీన హాస్పటల్కు తరలించి చికిత్స ఇస్తున్న సమయంలోనే తుది శ్వాస విడిచినట్లు పోలీసులు తెలిపారు.
విశాఖపట్నంకు చెందిన ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డి లంగర్ హౌస్ లో అద్దెకు ఉంటూ విధులకు వెళ్తూ వస్తున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. ఆదివారం ఉదయంసైనిక లాంఛనాల తర్వాత కోటీశ్వర్ రెడ్డి మృతిదేహాన్ని స్వస్థలమైన విశాఖపట్నం పంపారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
