అపచారం... ఈవో అయ్యుండి ఇదేం పని!

X
By - Chitralekha |26 May 2023 3:55 PM IST
పుష్కరిణిలో స్వామివారికి అభిషేకం జరుగుతుండగా, ఈతకొట్టిన ఈవో
నిజామాబాద్ జిల్లా నీలకంఠేశ్వరాలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈవో వేణు కొలనులో ఈతకొట్టడం వివాదానికి దారి తీసింది. అర్చకులు వారిస్తున్నా బేఖాతరు చేసిన వేణు స్వామివారికి అభిషేకం జరుగుతుండగానే ఈతకొట్టారు. ఈవో తీరుపై భక్తులు, స్థానికులు మండిపడుతున్నారు. నాలుగు ఆలయాలకు ఇన్ఛార్జ్ ఈఓగా పనిచేస్తున్న వేణు ఆలయ పవిత్రతను దెబ్బతీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
