Kangana Ranaut : ఢిల్లీలో రావణ దహనం చేయనున్న తొలి మహిళా సెలబ్రిటీ..!

దసరా ఉత్సవాల్లో చివరగా రావణ దహనం చేస్తారన్న విషయం తెలిసిందే . అయితే దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగిన దసరా ఉత్సవాల్లో కీలక ఘటన చోటుచేసుకోనుంది. ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణ్ దహన్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మహిళా సెలబ్రిటీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేయనున్నారు. ఈ ఏడాది కంగనా రనౌత్ ఢిల్లీలో దసరా ఉత్సవాలు జరుపుకోనున్నారు. సాధారణంగా ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణుడి దహనం కార్యక్రమాన్ని ప్రధానమంత్రి చేస్తుంటారు.
అయితే, ఎన్నికల కారణంగా మోదీ చాలా బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని చెయ్యలేకపోతున్నారు.. అలాగే ఈ ఏడాది మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ సారి మహిళా సెలబ్రిటీ కంగనా రనౌత్ ను రావణ్ దహన్ కార్యక్రమానికి రామ్ లీలా కమిటీ ఆహ్వానించింది. ఈ మెగా ఈవెంటుకు ఆమెతో పాటు పలువురు బాలివుడ్ సెలబ్రిటీలు హాజరవుతున్నారని సమాచారం..రావణ్ దహన్ కార్యక్రమాన్ని మాత్రం కంగనా చేయనున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాంలీలా మైదానంలో రావణ్ దహన్ చేసిన మొట్టమొదటి మహిళగా కంగనా నిలవనున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆర్ఎస్విపి నిర్మించిన తేజస్ టైటిల్ రోల్లో కంగనా రనౌత్ నటించింది. సర్వేష్ మేవారా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఈ సినిమాను అక్టోబర్ 27వతేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
