Tirupathi: టీటీడీ పరిపాలన భవనం ముందు హిందూ జేఏసీ నిరసన

Tirupathi: టీటీడీ పరిపాలన భవనం ముందు హిందూ జేఏసీ నిరసన
X

తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు హిందూ జేఏసీ నేతలు నిరసనకు దిగారు. శ్రీవారి భక్తులపై టీటీడీ కఠిన ఆంక్షలు విధించిందంటూ ఆందోళన చేపట్టారు. నడకదారి భక్తులపై పెట్టిన ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. టీటీడీ నిబంధనల వల్ల భక్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. టీటీడీ నిర్ణయాలు సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. శ్రీవారి భక్తులకు ఊతకర్రలు పంపిణీ చేస్తామని టీటీడీ చైర్మెన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు.

Tags

Next Story