TTD : టీటీడీకి స్కానర్ విరాళం

X
By - Manikanta |27 Aug 2025 8:45 PM IST
తిరుపతి రీజనల్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వారు టిటిడికి రూ.61.72 లక్షల విలువ గల స్మిత్ డిటెక్షన్ హై స్కాన్ విరాళంగా అందించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో ఐఓబి డైరెక్టర్ శ్రీ చంద్రారెడ్డి, రీజనల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ ఝా రూ. 61.72 లక్షల మంజూరు కాపీని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావుకుఅందించారు. తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో గల ఉగ్రహణం నుండి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీలో వినియోగించే ముడి సరుకులను శ్రీవారి పోటుకు పంపించే ముందు తనిఖీ చేసేందుకు ఈ స్కానర్ ను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల ఐఓబి మేనేజర్ శ్రీ మహేష్ బాబు, మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ రాజశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com